రోడ్డు ప్రమాదం: డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఎన్ఆర్ ఇళంగోవన్ కుమారుడు మృతి

Road accident on Narasaraopet flyover- Two killed
Road accident

పుదుచ్చేరి : డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఎన్ఆర్ ఇళంగోవన్ కుమారుడు రాకేష్ రోజు ఉదయం జరిగినా రోడ్డు ఆక్సిడెంట్లో మరణించారు.22 సంవత్సరాల రాకేష్ పుదుచేరు నుంచి మరో వ్వక్తితో కలసి చెన్నై వెళ్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రాకేష్ అక్కడే మృతి చెందారు ఆయనతో పాటు ప్రయాణిస్తున్నవ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కార్ నుజ్జునుజ్జయింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి క్రేన్ సాయముతో కారును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇంకా ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది .మాజీ సీనియర్ న్యాయవాది అయినా ఇళంగోవన్ 2020 నుంచి రాజ్యసభలో తమిళనాడుకు ప్రాతినిధ్యం చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/