మరోసారి తెలంగాణ లో పర్యటించబోతున్న డీకే శివ కుమార్‌

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూకుడు మీదున్న కాంగ్రెస్..ఇక ప్రచార సమయం ముగింపుకు చేరుకోవడం తో మరింత స్పీడ్ అవుతుంది. ఇప్పటికే అగ్ర నేతలు రాహుల్ , ప్రియాంక , ఖర్గే , శివ కుమార్ లు ప్రచారం చేసి జోష్ పెంచగా..ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. రాహుల్ , ప్రియాంక గాంధీల పర్యటన ఫిక్స్ కాగా..రేపు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ హైదరాబాద్ లో పర్యటించబోతున్నారు.

రేపు, ఎల్లుండి రెండు రోజులు పాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించి బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఇందుకోసం రేపు ఉదయం బెంగుళూరు నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గం కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. అక్కడ నుంచి వర్ధన్నపేట నియోజకవర్గంలో.. ఆ తర్వాత వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొని రాత్రి అంబర్ పేట నియోజక వర్గం కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. ఇక శనివారం హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాలలో రోడ్ షో లు, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొని ప్రచారం చేయనున్నారు.