మరోసారి తండ్రైన దిల్ రాజు..

ప్రముఖ నిర్మాత , డిస్ట్రబ్యూటర్ దిల్ రాజు మరోసారి తండ్రి పోస్ట్ కొట్టేసాడు. ఆయన భార్య తేజస్విని మగ బిడ్డకు జన్మించింది. దీంతో దిల్ రాజు ఇంటికి వారసుడు వచ్చాడంటూ టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి..తన మొదటి సక్సెస్ నే తన పేరు ముందు పెట్టుకొని రాజు కాస్త దిల్ రాజు అయ్యారు. నిర్మాత గా , డిస్ట్రబ్యూటర్ గా ఎన్నో సక్సెస్ లు లాభాలు అందుకుంటూ వస్తున్నారు.

ఆయన మొదటి భార్య అనిత 2017 సంవత్సరం లో అనారోగ్యంతో మరణించింది. అప్పటికే దిల్ రాజు కు కూతురు హర్షిత రెడ్డి ఉండగా.. ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాత అయిన దిల్ రాజు..భార్య మరణం తర్వాత కొన్ని నెలల పాటు ఒంటరిగా ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత 2020 సంవత్సరం డిసెంబర్ మాసంలో దిల్ రాజు, తేజస్విని రెండో వివాహం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి తండ్రయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. శంకర్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా , తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.