అమరావతిః వైఎస్ఆర్సిపి పాలనకు ముగింపు పలకడమే ధ్యేయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రెండు విడతల యాత్ర పూర్తయింది. వారాహి యాత్రలకు ముఖ్యంగా యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. తాజాగా మూడో విడత యాత్రకు పవన్ రెడీ అయ్యారు. ఈ నెల 10 నుంచి విశాఖపట్నంలో మూడో విడత యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పలు కమిటీలను జనసేన అధినాయకత్వం ఖరారు చేసింది.