ధోని నన్ను టీజ్ చేసేవాడు
అతనికి నేనో సవాల్ విసిరాను: బ్రావో
చెన్నై: కరోనా మహామ్మారి కారణంగా ఐపిఎల్ వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ఖాళీ సమయంలో చెన్నై ప్రాంచైజి తమ ఆటగాళ్లతో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్స్ నిర్వహిస్తుంది. ఇందులో చెన్నై సూపర్కింగ్స్ కు ఆడుతున్న వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్బ్రావో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2018 లో తనకు వయసు అయిపోయింది. వేగంగా పరుగెత్తలేక పోతున్నావని ధోని ఏడిపించేవాడని అన్నాడు. ఈ టిజింగ్తో అతనికో సవాల్ విసిరినట్లు గుర్తు చేశాడు. ఇద్దరం వికెట్ల మధ్య పరుగుపెడదాం సవాల్ విసరగా..అందకు మొదటగా ధోని నిరాకరించినట్లు చెప్పాడు. అయితే ఫైనల్ తర్వాత పోటీ పడదామని చెప్పాడు. దీంతో సన్రైజర్స్తో ఫైనల్ పోటీ ముగిసిన అనంతరం ఇద్దరం వికెట్ల మధ్య పరుగుపెట్టాము. అందులో కొద్ది తేడాతో ధోని విజయం సాధించాడు. అని బ్రావో గుర్తుచేసుకున్నాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/