అజాత శత్రువు: ధర్మరాజు
ఆధ్యాత్మిక చింతన
అజాతశత్రువు అనగానే మనకు మహాభారతంలోని ధర్మరాజు గుర్తుకొస్తాడు. కౌషీతకీ ఉపనిషత్ వివరణమగు ‘ఆత్మపురాణంలో కాశీరాజును గురించి ఉంది.
ఆయన పేరు కూడా అజాతశత్రువు.. ఆయన సకల ధర్మాత్మ పురుషులందు ప్రముఖుడు, వినయ విధేయతగలవాడు, సత్యమందు స్థితిగలవాడు, మహాత్ముల సేవలో ఆనందం పొందేవాడు,.
తన బలంకన్నా అధికబలం గల శత్రువు ఎవడూ భూమండలంలో లేకపోవటం వల్ల అజాతశత్రువ్ఞ అని పేరు పొందినవాడు.
అంతేకాక కామక్రోధాధి శత్రువ్ఞలు కూడా లేనివాడు, సకలజనులందు, సకల పదార్థములందు సమభావం గలవాడు. క్షత్రియుడై భుజబలమును, జ్ఞానియై ఆత్మతత్త్వమును పొందినవాడు.
గర్గగోత్రము గల ‘బలాక అనే బ్రాహ్మణుడుంటే వాడు. ఆయన షడంగసహిత నాలుగు వేదములను అధ్యయనం చేసినవాడు.
ఆయన కుమారుడు ‘బలాకి. సర్వశాస్త్రాలను చదివి తండ్రికి మించిన తనయుడయ్యాడు. అయితే తండ్రిలో వికసించిన వినయములోపించింది, గర్వం విజృంభించింది
బలాకిలో. నేను సర్వబ్రాహ్మణుల్లో శ్రేష్ఠుడను, నాతో సమానముగా ఎవడును విద్వాంసుడు లేడు అని భావించసాగాడు. విద్యామదధనమదం, యవ్వనమదం ఇన్ని దుర్గుణాలకు లోనై బ్రాహ్మణధర్మమందు నిష్ఠకలుగలేదు.
వేయి చేతుల గల బాణాసురుడు తన భుజబలాన్ని తలచుకొని గర్వించి సరాసరి మహాదేవుని వద్దకే వెళ్లి నమస్కరించి ‘దేవా! నీవు నాకు వేయి చేతులు ప్రసాదించావు.
వాటితో కొండలను పిండి చేశాను, మదించిన ఏనుగుల గుంపులను పీనుగలుగా మార్చాను. అయినా నాకు యుద్ధకండూతి తగ్గలేదు. నాతో సమానబలం కలవాడిని చూపించు అని కోరాడు (పుట 764-భాగవతసుధ-రామకృష్ణతపోవనం-చెన్నై).
అలాగే బుద్ధిబలం, వాదనాపటిమ, పాండిత్యం వ్ఞన్నవారికి ఇంకొంత ఎక్కువే అహంకారముంటుంది. ఎప్పుడూ ఎవరితోనైనా శాస్త్రచర్చచేయాలని, వాదించాలని, ఓడించాలని ఉబలాటపడుతుంటారు.
అలాంటి మిళిందుడనే రాజు నాగసేనుడు అనే బౌద్ధ గురువ్ఞను కలిసి, వాదించి, ఓడి ఆయనకు శిష్యుడైన విషయాన్ని మనకు చరిత్ర తెలుపుతుంది.
సరిగ్గా అలాగే జరిగింది బలాకి జీవితంలోనూ. ఆయన హిమాచలము నుంచి రామేశ్వరము వరకు కురుపాంచాల కాశీమిధిల మొదలు క్షేత్రాలలో సంచరించి అక్కడి పండితులను చర్చకు పిలిచాడు, సవాలు చేశాడు, ఓడించాడు.
తాను జగదేక పండితుడని విర్రవీగాడు. శాస్త్రచర్చకు మూడు రూపాలుంటాయి.
1. జల్పం అంటే ఉచితానుచితములను పాటింపక తన పక్షమున మండలం, ఎదుటిపక్షమున ఖండనం చేయు విధానం,
2. వితండము అంటే కేవలం ఎదుటిపక్షము వారి చర్చను ఖండించటం
3. వాదము-నిర్మలమైన మనస్సుతో తత్త్వనిర్ణయం చేయుట.
ఆత్మజ్ఞానం లేక, కేవలం శాస్త్రజ్ఞానం, పాండిత్యం గలవారు సాధారణంగా చర్చలో జల్పాన్ని, వితండవాదాన్ని అనుసరిస్తారు.
ఏదోలా తమ వాక్చాతుర్యంతో ఎదుటివారిని మట్టి కరిపిస్తారు. బలాకి కూడా ఆ కోవకు చెందిన వాడే కావటంతో అన్ని క్షేత్రాల్లో, పండితులందర్నీ ఓడించి చివరకు కాశీక్షేత్రంలోని పండితులను ఓడించాడు.
కాశీ రాజు అజాతశత్రువ్ఞ కూడా పండితుడే అని తెలిసికొని అతనిని జయించాలని తలిచాడు. ఆయన్ను కలిసి ‘ఓ రాజా! నీవ్ఞ బ్రహ్మాజ్ఞాన రహితుడని. నీకు నేను బ్రహ్మెపదేశము చేస్తాను, అన్నాడు.
తను తెలుసుకొన్న విషయాన్నంతా ఏకరువ్ఞపెట్టాడు. ఇదంతా నాకు ముందే తెలుసు, ఇంకా ఏమి ఉందో చెప్పమన్నాడు రాజు.
నాకు తెలిసినది అంతే అన్నాడు బలాకి. అప్పుడు రాజు తనకు తెలిసిన విషయాలను వివరిస్తే బలాకి ఆ రాజునే తన గురువ్ఞగా స్వీకరించి తలవంచాడు.
రాజు బలాకి చేతిని పట్టుకొని రహస్యాస్థాన్ని సపలో ఉపదేశించరాదని తన అంతఃపురంలోకి తీసుకెళ్లి ఉపదేశం చేశాడు (పుటలు 18,19,20 ధర్మోపన్యాసాలు, 3వ భాగం)
శాస్త్రాలలోని ప్రతి పదానికి అర్థం, తాత్పర్యం తెలియటం విద్యకాదు, వాటి తత్త్వం తెలియాలి. అది తెలిస్తే వినయం కల్గుతుంది. అందుకే ‘విద్యయొసగును వినయంబు అన్నారు.
నిజమైన విద్యావంతుడు చర్చలకు సవాలు విసరడు. మౌనాన్ని ఆశ్రయిస్తాడు, అందరినీ గౌరవిస్తాడు.
- రాచమడుగు శ్రీనివాసులు
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/