నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండండి: డీజీపీ రవిగుప్తా

నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్లు, ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష

dgp-ravi-gupta-orders-to-police-on-new-year-events

హైదరాబాద్ః 2024 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా… నార్కోటిక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై డీజీపీ రవిగుప్తా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ… డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. నూతన సంవత్సరం పేరుతో సంబరాలు జరుపుకుంటారని, అయితే పోలీసు సిబ్బంది అలర్ట్‌గా ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, డ్రగ్స్ రాకుండా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలన్నారు.