రేపు గోదావరి వరద ముంపు బాధితుల ఖాతాల్లో రూ.10 వేలు జమ – పువ్వాడ

minister-puvvada

భద్రాచలం గోదావరి వరద ముంపు బాధితుల ఖాతాల్లోకి రేపు రూ. 10 వేలు జమ చేయబోతున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రీసెంట్ గా కురిసిన భారీ వర్షాలకు , వరదలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహించిన సంగతి తెలిసిందే. ముఖ్యముగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం దాదాపు 70 అడుగుల మేర ప్రవహించడం తో లోతట్టు ప్రాంతాలతో పాటు భద్రాచలం లోని పలు కాలనీ లు నీట మునిగాయి. అయితే వరద ముంపు బాధితుల పునరావాసానికి సీఎం కేసీఆర్ రూ. 10 వేలు ప్రకటించారు.

ఈ పది వేలు రేపు వారి ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. వరద బాధిత కుటుంబాలు ఒక ఇంటికి 20 కిలోల బియ్యం, 5 కిలోల కందిపప్పు, 2 నెలల పాటు ఉచితంగా ఇస్తామని.. అలాగే పదివేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సీఎం కేసీఆర్ భద్రాచలం పర్యటనలో హామీ ఇచ్చారని, ఈ మేరకు బాధితులకు సహాయార్థం సేకరించిన వారి వివరాల ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే బాధిత కుటుంబాలకు బియ్యం కందిపప్పు పంపిణీ పూర్తయిందని మంత్రి అజయ్ తెలిపారు.

భద్రాచలం ప్రాంతంలో వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పట్టణ కాంటూరు లెవెల్స్ ను పరిగణలోకి తీసుకొని వరద బాధితులకు ఎత్తైన ప్రదేశాల్లో కాలనీల నిర్మాణం చేపట్టాలని సూచించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భాంగా గుర్తు చేసారు.