తిరుమలకు పోటెత్తిన భక్తులు..సర్వదర్శనానికి 30 గంటలు

వరుస సెలవులు రావడంతో తిరుమల కు భక్తులు పోటెత్తారు. దీంతో సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టమెంట్‌లు నిండిపోయాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు శిలా తోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టీటీడీ అధికారులు భక్తులకు పలు సూచనలు చేశారు. రూ.300 ప్రత్యేక దర్శనం, దివ్య దర్శనం టోకెన్లు ఉన్నవారు మాత్రమే తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే భక్తుల కోసం తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనంతో పాటు భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు తాగునీటిని శ్రీవారి సేవకులు అందిస్తున్నారు. వీరితో పాటు ఆరోగ్య, విజిలెన్స్‌ విభాగాలు ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నాయి. ఏప్రిల్ 8వ తేదీ శనివారం సాయంత్రం 5గంటల వరకు దాదాపు 50వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది.