చందానగర్ లో ఘోరం..మస్కిటో లిక్విడ్ తాగి చనిపోయిన చిన్నారి

ఏడాదిన్నర వయస్సు చిన్నారి..ఆడుకుంటూ ఆడుకుంటూ మస్కిటో లిక్విడ్ తాగి చనిపోయిన ఘటన చందానగర్ లో జరిగింది. రీసెంట్ గా ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో దోమల బాధ నుంచి తప్పించుకోవడం కోసం ఉపయోగించే మస్కిటో కాయిల్‌ బెడ్ ఫై పడి ఏకంగా ఆరుగుర్ని బలి తీసుకుంది.

ఇక ఇప్పుడు హైదరాబాద్ లోని చందానగర్ లో ఏడాదిన్నర వయస్సు ఉన్న జాకీర్ అనే చిన్నారి.. ఆడుకుంటూ ఆడుకుంటూ దోమల మందు తాగేశాడు. ఇంట్లో దొమలను చంపటానికి పెట్టుకున్న లిక్విడ్ బాటిల్ తో ఆడుకుంటూ.. నోట్లో పెట్టుకుని తాగేశాడు. చిన్నారి ఏడుస్తుండటంతో.. ఎత్తుకున్న తల్లిదండ్రులకు మస్కిటో లిక్విడ్ వాసన వచ్చింది. దీంతో లిక్విడ్ తాగి ఉంటాడని గమనించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రమాద వశాత్తు జరిగిందా లేక బాలుడి మరణంలో మరో కోణం ఏమైనా ఉందా అనే విషయంపై పేరంట్స్ ను విచారిస్తున్నారు.