తిరుమ‌ల ఆనంద నిల‌యంలో వీడియో తీసిన వ్యక్తిని గుర్తించిన అధికారులు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఆదివారం రాత్రి ఆలయంలోకి ఓ భక్తుడు మొబైల్‌తో ప్రవేశించాడు. ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి తన మొబైల్‌లో చిత్రీకరించాడు. ఈ వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో.. భద్రతా సిబ్బంది తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ వీడియో తీసిన వ్యక్తిని అధికారులు గుర్తించారు.

రాహుల్ రెడ్డి అన్నే భక్తుడు ఆనంద నిలయం వీడియో చిత్రికరణ చేశాడని.. రాహుల్ ఉద్దేశపూర్వకంగా వీడియో రికార్డు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాహుల్ రెడ్డిని అదుపులోకి తీసుకొని.. పోలీసులు విచారణ జరుపుతున్నారన్నారు. సెక్యూరిటీ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించామని.. సీవీఎస్వో, వీజీవోతో పాటు భద్రతధికారులను మందలించామన్నారు. భద్రతా వైఫల్యానికి కారణమైన సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్ చేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ సహకారంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామ‌ని ఈవో స్పష్టం చేశారు.