ఢిల్లీ పయనమైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

Bhatti Vikramarka

హైదరాబాద్‌ః డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఈ రోజు మధ్యాహ్నం ఏఐసీసీ అధ్వర్యంలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల కో-ఆర్డినేటర్ల సమావేశంలో పాల్గొననున్నారు . ఇక ఈరోజు రాత్రికి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా రానున్న లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతోంది.

ఇందులో భాగంగానే.. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతపై ఏఐసీసీలో ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. లోక్ సభ కోఆర్డినేటర్లతో సమావేశం కానున్నారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ. తెలంగాణ లో 17 లోక్ సభ స్థానాలకు 13 మంది కో ఆర్డినేటర్లను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు రెండేసి లోక్ సభ స్థానాలకు కో ఆర్డినేటర్లుగా నియమించింది ఎఐసిసి. ఇక ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఎఐసిసి లో సమావేశం జరుగనుంది.