వైఎస్సార్ జగనన్నశాశ్వత భూహక్కు భూరక్ష పథకం ప్రారంభం

గుంటూరు జిల్లాలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్ పర్యటన

AP Deputy CM Krishnadas visits Guntur district
AP Deputy CM Krishnadas visits Guntur district

Mangalagiri: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని డిప్యూటీ సీఎం, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారంలో ఇవాళ పర్యటనకు విచ్చేసిన డిప్యూటి సీఎం కృష్ణదాస్ కు హోం మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి, తెనాలి ఎమ్మెల్యే లు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, అన్నా బత్తుని శివకుమార్ తదితరులు స్వగతం పలికారు.

Home Minister Sucharita welcoming Deputy CM Krishnadas. Mangalagiri MLA Alla Ramakrishna Reddy can also be seen
Home Minister Sucharita welcoming Deputy CM Krishnadas. Mangalagiri MLA Alla Ramakrishna Reddy can also be seen

రీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా గ్రామంలో సరిహద్దు రాళ్ళ ను వేసి, అనంతరం ఫోటో ఎగ్జిభిషన్, అక్కడే ఏర్పాటు చేసిన స్టాళ్లను డిప్యూటీ సీఎం పరిశీలించారు. కార్యక్రమంలో సీసీఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉషారాణి, లాండ్ సర్వే కమిషనర్ సిద్ధార్థ జైన్ తదితరులు పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/