క్రిమిన‌ల్ చెప్పులు మోస్తూ చప్రాసీ ప‌ని చేస్తున్నారంటూ సీపీఐ నారాయ‌ణ ఫైర్

క్రిమిన‌ల్ చెప్పులు మోస్తూ చప్రాసీ ప‌ని చేస్తున్నారంటూ బండి సంజయ్ ఫై సీపీఐ నారాయ‌ణ ఆగ్రహం వ్యక్తం చేసారు. నిన్న ఆదివారం మునుగోడు సభ కు హాజరైన కేంద్రమంత్రి అమిత్ షా..ముందుగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం అమిత్ షా బయటకు వస్తుండగా ఆయన వెంటే ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..అమిత్ షా కంటే ముందు వెళ్లి ఆయన చెప్పులు తీసి..ఆయన కాళ్ల ముందు పెట్టినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలు పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపట్ల సీపీఐ నారాయ‌ణ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. చెప్పులు మోసే బీజేపీ నాయ‌కులు త‌మ‌ను విమ‌ర్శించ‌డం స‌రికాద‌న్నారు. మీ బ‌తుకేందో త‌మ‌కు ఇప్పుడు అర్థ‌మైంద‌న్నారు. హోం మినిస్ట‌ర్ పెద్ద క్రిమిన‌ల్. ఆయ‌న ఓ కేసులో 12 మంది సాక్షుల‌ను, లాయ‌ర్ల‌ను హ‌త్య చేయించాడు. అట్లాంటి క్రిమిన‌ల్ వ్య‌క్తి దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌న‌కు హోం మినిస్ట‌ర్ అయ్యాడు. మీరు చెప్పులు మోస్తూ చప్రాసీ ప‌ని చేస్తున్నార‌ని రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేసారు. మీలాంటి వారు క‌మ్యూనిస్టుల‌ను విమ‌ర్శించ‌డం స‌రికాదు. మిమ్మ‌ల్ని ఓడించ‌డానికి దెయ్యంతోనైనా క‌లిసి పోరాడుతాం. కేసీఆర్‌తోనైనా క‌లుస్తాం.. ఇంకెవ‌రితోనైనా క‌లుస్తామ‌ని నారాయ‌ణ‌ తేల్చిచెప్పారు. బీజేపీని ఓడించేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. క‌మ్యూనిస్టుల‌ను విమ‌ర్శించే నైతిక హ‌క్కు బీజేపీ నేత‌ల‌కు లేద‌న్నారు.

మరోవైపు తనఫై వస్తున్న ఆరోపణల ఫై బండి సంజయ్ స్పందించారు. కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందించడం భారతీయతను పాటించే మాకు అలవాటు. మా కుటుంబ పెద్ద, గురుతుల్యుడు వంటి కేంద్ర హోమంత్రికి వయసులో చిన్నవాడినైన నేను చెప్పులు అందించడం గులామ్ గిరీ అవుతుందా? మీరు సాష్టాంగ దండప్రమాణం చేసినప్పుడు బెంగాల్ కు, తమిళనాడుకు గులాములు అయ్యారా? ఇప్పుడు పాదరక్షలు అందిస్తే గుజరాత్ కు గులాము అయినట్టా? అని టిఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల ఫై బండి సంజయ్ ఫైర్ అయ్యారు.