రాజ్యసభకు దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌ దాఖలు

హైదరాబాద్: రాజ్యసభకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌రెడ్డి, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నామినేషన్లను దాఖలు చేశారు.

తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు గత మంగళశారం నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా దామోదర్‌రావు, బండి పార్థసారధికి జగిత్యాల ఎమ్మెల్యే బండి సంజయ్‌కుమార్‌తో పాటు పలువురు నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/