పప్పు పరోటా..

రుచి : వెరైటీ వంటకాలు

కావాల్సినవి :

గోధుమ పిండి- అర కిలో, సెనగ పప్పు- ఒక కప్పు, కారం – అర టీ స్పూన్, పసుపు- చిటికెడు, మామిడికాయ పొడి – అర టీ స్పూన్, గరం మసాలా- అర టీ స్పూన్, జీలకర్ర పొడి- అర టీ స్పూన్,.

తయారు చేసే విధానం

గోధుమ పిండిలో నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంగా చేసుకునే పక్కన పెట్టుకోవాలి.. సెనగ పప్పును మూడు గంటల పాటు నానబెట్టి తరువాత మెత్తగా అయ్యే దాకా ఉడికించాలి. పప్పు చల్లారిని తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి టీయూకోవాలి.. అందులో పసుపు, కారం , కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలుపుకుంటే స్టఫ్ రెడీ.. గోధుమ పిండిని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ వెడల్పాటి చపాతీలా చేసుకోవాలి.. మధ్యలో డాల్ స్టఫ్ పెట్టి అన్ని వైపుల నుంచి దగ్గరకు మూయాలి. ఇపుడు నెమ్మదిగా చపాతీ కర్రతో మళ్లీ వెడల్పుగా చేసుకోవాలి.. పెనం పై నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి .

ఆరోగ్య సంబంధిత వ్యాసాల కోసం ‘స్వస్థ’ క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/specials/health/