సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ విడుదల చేసిన ఏఐసీసీ

cwc-meetings-schedule-hyderabad

న్యూఢిల్లీః హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 16, 17వ తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల ఏర్పాట్లలో రాష్ట్ర నాయకత్వం తలమునకలై ఉంది. ఈ ఏర్పాట్లపై ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కేసీ వేణుగోపాల్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్​ను ఏఐసీసీ తాజాగా విడుదల చేసింది.

ఏఐసీసీ షెడ్యూల్ ప్రకారం..

.ఈనెల 16 తేదీన మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ పీసీసీ ఇచ్చే లంచ్​కు సీడబ్ల్యూసీ సభ్యులు హాజరు కానున్నారు.
.అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు అంటే లంచ్ తర్వాత హోటల్ తాజ్ కృష్ణాలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది.
.17వ తేదీన ఉదయం 10:30 గంటలకు ఎక్సెటెండెడ్ సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది.
.సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభలో సీడబ్ల్యూసీ, అన్ని రాష్ట్రాల పీసీసీ, సీఏల్పీ నేతలు పాల్గొననున్నారు.
.18వ తేదీన ఎంపీలు మినహా మిగతా నేతలంతా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర ప్రజలకు 5 హామీలతో కూడిన గ్యారెంటీ కార్డులను ప్రజలకు అందజేయనున్నారు.