అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్ర‌తిష్ట‌కు వెళ్ల‌డం లేదు: సీపీఎం నేత బృందా కార‌త్‌

CPI(M) to not attend Ram Temple inauguration event in Ayodhya, party leader Brinda Karat explains why

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో వచ్చే నెల 22న రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అయోధ్య రామాలయ ట్రస్ట్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకకు తరలి రానున్న ప్రముఖులు, అతిథులు, భక్తుల కోసం వసతుల కల్పనపై దృష్టి సారించింది. మరోవైపు ప్రముఖులకు ఆహ్వానాలు కూడా పంపుతోంది. ఈనేపథ్యంలోనే త‌మ పార్టీ త‌ర‌పున ఆ కార్య‌క్ర‌మానికి ఎవ‌రూ వెళ్ల‌డం లేద‌ని సీపీఐ నేత బృందా కార‌త్ తెలిపారు. మ‌త‌ప‌ర‌మైన విశ్వాసాల‌ను గౌర‌విస్తామ‌ని, కానీ మ‌త సంబంధ‌మైన అంశాన్ని రాజ‌కీయం చేస్తున్నార‌ని, ఇది స‌రైన విధానం కాదు అని బృందా కార‌త్ తెలిపారు.