ఇంటి వైద్యానికే జై

కరోనా నియంత్రణా చర్యలు

Corona control measures-home medicine
Corona control measures-home medicine

కరోనా వైరస్‌ దడపుట్టిస్తున్న వేళలో మళ్లీ మన ఇంటివైద్యమే అక్కరకు వచ్చింది.

అయినదానికీ కాని దానికీ గుప్పెడు గుప్పెడు మాత్రలు మింగే దౌర్భాగ్యం నుంచి జనం మెల్లగా మళ్లీ దారి మార్చు కుంటున్నారు.

పోపుల పెట్టె గొప్పదనాన్ని తెలుసుకుంటున్నారు. వంటింటిలో ఉండే దినుసుల గురించి ఎవరైనా చెబితే మనసు పెట్టి వింటున్నారు.

కరోనా భయం అలముకున్న తర్వాత మళ్లీ పాత పద్ధతిలో కషాయాలు తయారు చేయడం మొదలుపెట్టారు. గోరువెచ్చని పాలలో పసుపు కలిపి సేవిస్తున్నారు.

Ginger Tea-

అల్లం టీ, లెమన్‌ టీ అంటూ ప్రాధాన్యత ఇస్తున్నారు. కషాయం ఉదయం, రాత్రి రెండు పూటలా ఇష్టపడి మరీ తాగుతున్నారు.

కరోనా వైరస్‌ ప్రబలిన నేపధ్యంలో అటు సాధారణ వ్యక్తి నుంచి ఇటు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, వ్యాపారస్తులు, ఉద్యోగుల వరకూ ప్రతి ఒక్కరూ ఇలా చిట్కాలు పాటిస్తున్నారు.

వానలు పడుతుండడంతో కరోనాలో పోలిన లక్షణాలు చాలామందిలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా జలుబు, దగ్గు కనిపిస్తే చాలు చాలా ఇబ్బందులు వస్తున్నాయి.

ఈ నేపధ్యంలో ముందుగానే ప్రతి ఇంట్లో ఆరోగ్య చిట్కాలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు కషాయం, లెమన్‌, అల్లం టీలు తప్పనిసరిగా మారాయి.

జలుబు వచ్చిందంటే చాలు వేడి నీటి ఆవిరిని పట్టడం, వెంటనే కషాయం తాగడం చేస్తున్నారు. గొంతువద్ద నొప్పిగా ఉన్నా, దగ్గు ఉన్నా వెంటనే పసుపు కలిపిన పాలను సేవిస్తున్నారు.

వీటికి తోడు దగ్గర్లో తులసి మొక్కలు ఉంటే వాటి ఆకులను గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతున్నారు. ఈ చిట్కాలు ఎంతో మంచివని వైద్యులు కూడా నిర్ధారిస్తున్నారు.

గతంలో కషాయం అంటే ఎవరికీ నచ్చేది కాదు. ఇప్పుడు ఈ కషాయానికి చాలా డిమాండ్‌ ఉంది. మిరియాలు, సొంఠి కొమ్ము, అల్లం, లవంగాలు మిళితంగా ఈ కషాయం తయారు చేస్తున్నారు.

రాత్రి నిద్రపోయేముందు, ఉదయం లేచిన వెంటనే ఈ కషాయం సేవించడం చేస్తున్నారు.

కొంతమంది ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని పాలలో పసుపు వేసుకుని, ఇంకొందరు మిరియాల చారు, మిరియాలు ఉండే కూరలు తయారు చేస్తున్నారు.

ఈ వైఖరి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు.

Ginger Lemon Tea

గృహవైద్యంగా చెప్పే కషాయం ఇప్పుడు అన్ని సామాజిక మాద్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

ఆయుర్వేద వైద్యులతోపాటు పెద్దపెద్ద ఆస్పత్రుల వైద్యులు కూడా కషాయానికి ప్రాధాన్యత ఇవ్వమంటున్నారు.

దీంతో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో కషాయం, తులసి ఆకుల నీరు, అల్లం టీ, లెమన్‌ టీల ప్రచారం ఎక్కువైంది.

గతంలో ప్రతి ఇంట్లో టీ సాధారణంగా చేసుకునేవారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసిన అల్లంకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

చిన్నచిన్న కుటుంబాలు కూడా తాము తాగే టీలో అల్లం కలిపి టీ చేస్తున్నారు. వేడివేడి అల్లం టీ తాగి వ్యాధినిరోధక శక్తి పెంచుకుంటున్నారు.

ఇంకొందరు నిమ్మరసంతో తయారు చేసిన టీని సేవిస్తున్నారు. ఇందులో తులసి, పుదీనా ఆకులను వేసి వ్యాధినిరోధక శక్తిని పెంచే పద్ధతులు పాటిస్తున్నారు.

వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు కొంతమంది మరికొన్ని పద్ధతులు పాటిస్తున్నారు.

రోజు ఉదయమే పది గ్రాముల చ్యవన్‌ప్రాస్‌ తీసుకుంటున్నారు.

హెర్బల్‌ టీ తాగడం, తులసి, దాల్చిన చెక్క, నల్లమిరియాలు, శొంటి వేసిన కషాయం సేవిస్తున్నారు.

బెల్లం, నిమ్మరసాన్ని అందులో మిక్స్‌ చేస్తున్నారు.

రోజులో రెండు పర్యాయాలు ఎండుద్రాక్ష తింటున్నారు. పాలలో పసుపు కలిపి సేవిస్తున్నారు.

కృష్ణతులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి నిరంతరం సేవిస్తున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/