పాకిస్తాన్ అధ్యక్షుడితో భేటీ అయిన శత్రుఘ్నసిన్హా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వితో రాజకీయవేత్తగా మారిన సినీ నటుడు, కాంగ్రెస్ నేత శత్రుఘ్నసిన్హా ఆదివారం సమావేశమయ్యారు. ఇరు దేశాల సరిహద్దు వద్ద శాంతియుత వాతావరణాన్ని పెంపొందించే అంశంపై ఇరువురు నేతలు చర్చించినట్లు పాక్ అధ్యక్షుడు ట్వీట్ చేశారు. పాకిస్తాన్లో ఒక వివాహ వేడుకలో పాల్గొనడానికి శత్రుఘ్నసిన్హా అక్కడకు వెళ్లారు. తన పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని, అధికారికం కాదని, రాజకీయం లేదని శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/