అన్న క్యాంటీన్ల రద్దుతో పేదల కడుపు కొడుతున్నారు

ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్నారు

nakka anand babu
nakka anand babu

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అన్న క్యాంటీన్ల రద్దుతో పేదల కడుపు కొడుతున్నారని టిడిపి నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం అన్న క్యాంటీన్ల వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. కృత్రిమ ఇసుక కొరత సృష్టించి ట్రక్కు రూ. 6వేలకు అమ్ముకుంటున్నారని వైఎస్‌ఆర్‌సిపి నేతలపై మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి మంతులు, ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మరో నేత కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..బీసీల సమస్యలపై గళమెత్తినందునే తమ నేత అచ్చెన్నాయుడిపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. విజిలెన్స్‌ రిపోర్టులో అచ్చెన్నాయుడు పేరు లేదని ..అసెంబ్లీలో అచ్చెన్నాయుడికి సమాధానం చెప్పే దమ్ము వారికి లేకనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/