పోసాని ఫై కేసు నమోదు

నటుడు పోసాని కృష్ణ మురళీ ఫై పోలీసులు కేసు నమోదు చేసారు. మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పటు చేసి పవన్ కళ్యాణ్ ఫై తీవ్ర పదజాలం తో దూషించడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు , జనసేన కార్య కర్తలు పోసాని ఫై హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసారు. పోసాని ఫై కఠిన చర్యలు తీసుకోవాలని పిర్యాదు లో పేర్కొన్నారు. పిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆయన ఫై కేసు నమోదు చేసారు. మరోపక్క పోసాని కూడా పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేయాల‌ని నిర్ణయించుకున్నారు. మొత్తం మీద ఇటు అభిమానులు , అటు పోసాని ఒకరిపై ఒకరు కేసులు పెట్టడం దుమారంగా మారింది.

వైసీపీ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల చేసిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌పై ఏపీ మంత్రులు మాటల దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో జగన్ ను అభిమానించే పోసాని..పవన్ కళ్యాణ్ ఫై మండిపడ్డారు. దీంతో పోసాని ఫోన్ కు బెదిరింపు కాల్స్ , మెసేజ్ లు వస్తున్నాయని ఆయన మీడియా సమావేశం ఏర్పటు చేసి అభిమానులను కంట్రోల్ లో పెట్టాలని పవన్ కళ్యాణ్ కు చెపుతూ..ఆయన కుటుంబ సభ్యులపై , వ్యక్తి గత విషయాల ఫై కామెంట్స్ చేసారు. పోసాని కామెంట్స్ ఫై ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.