సిఎం కెసిఆర్ తీరు నన్ను చాలా బాధించిందిః గవర్నర్ తమిళసై

నా తేనేటివి ఎందుకు స్టాలిన్ కూడా రాలేదని ఆగ్రహం

CM KCR’s behavior hurt me a lot: Governor Tamilsai

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ మరియు తమిళనాడు సీఎం స్టాలిన్లపై గవర్నర్ తమిళ సై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిఎం కెసిఆర్ లాగానే సీఎం స్టాలిన్ కూడా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. సంప్రదాయ ప్రకారం గవర్నర్ తేనేటి విందుకు ఏర్పాటు చేస్తారు. అలాగే గవర్నర్ తమిళ సై కూడా తేనేటి విందును ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ వెళ్లలేదు.

ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. అయితే ఈ వ్యవహారంపై గవర్నర్ తమిళసై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిఎం కెసిఆర్ తీరు నన్ను చాలా బాధించిందని… నా తేనేటివి ఎందుకు స్టాలిన్ కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కెసిఆర్ మూడోసారి కూడా ఇలాగానే వ్యవహరించారని గవర్నర్ తమిళ సై మండిపడింది. ఇక అటు తెలంగాణ బిజెపి నేతలు కూడా ఈ విందుకు హాజరు కాలేదు.