నేడు కొల్హాపూర్ కు వెళ్లనున్న సీఎం కెసిఆర్
కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్: సీఎం కెసిఆర్ నేడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. దేశంలోని శక్తి పీఠాలలో ఒకటైన మహలక్ష్మీ అమ్మవారిని కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కోల్హాపూర్ బయలుదేరుతారు. దర్శనం అనంతరం సాయంత్రం హైదరాబాద్ తిరుగుపయనం కానున్నారు. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడోదైన కొల్హాపూర్ మహాలక్ష్మీ ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది భక్తులు దర్శించుకుంటారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/