మహాత్మా గాంధీ కి గవర్నర్, సిఎం కెసిఆర్ నివాళి
హైదరాబాద్: సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఉదయం 10 గంటల 45 నిమిషాల సమయంలో లంగర్హౌస్లోని బాపూఘాట్ వద్ద మహత్ముడి విగ్రహానికి పూలమాల వేసి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ఉన్నతాధికారులు కూడా మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/