వైఎస్ఆర్సిపి అప్పుడు-ఇప్పుడు..టిడిపి పార్టీ
అప్పట్లో గాంధీజీ అహింసో పరమధర్మః పాటించారు
ఇప్పుడు వైఎస్ఆర్సిపి నేతలు హింసో పరమధర్మః పాటిస్తున్నారు
అమరావతి: నేడు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ ఆదర్శాలను గుర్తు చేస్తూ టిడిపి పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ కార్టూన్ను పోస్ట్ చేసింది. అలాగే, ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఎన్నో దాడులు జరుగుతున్నాయంటూ విమర్శించింది. అప్పట్లో గాంధీజీ అహింసో పరమధర్మః నినాదంతో ముందుకు వెళ్లారని, ఇప్పుడు వైఎస్ఆర్సిపి నేతలు హింసో పరమధర్మః నినాదంతో ప్రవర్తిస్తున్నారని అందులో పేర్కొంది. వైఎస్ఆర్సిపి సిద్ధాంతం ఇదేనని చెప్పింది. ‘నిస్వార్థ రాజకీయాలకు, నిష్కళంక దేశభక్తికి ప్రతిరూపాలైన గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిలు సమానత్వం కోసం, పేదల సంక్షేమం కోసం అనుక్షణం పోరాడిన ధీరులు. ఆ మహానుభావుల జయంతి సందర్భంగా వారు ఆశించిన సర్వజన సంక్షేమ రాజ్యం కోసం కృషిచేద్దాం’ అని టిడిపి మరో ట్వీట్లో పేర్కొంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/