ఢిల్లీ పర్యటనలో జగన్..నేడు అమిత్ షా తో భేటీకి అవకాశం

న్యూఢిల్లీ : సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మొదటి రోజు పర్యటనలో ప్రధాని మోడీ తో భేటీ అయిన సీఎం జగన్ నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షాతో పాటు గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్‌ను కలవనున్నట్లు సమాచారం. మంత్రులతో భేటీ అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణం అవుతారు.

రాష్ట్రానికి సంబంధించి పలు పెండింగ్‌ సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. సాయంత్రం ప్రధాని మోడీ తో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు పీఎంతో చర్చించారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు సీఎం జగన్. సీఎం వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మార్గాని భరత్ రామ్, బాలశౌరి, నందిగం సురేశ్, గోరంట్ల మాధవ్, ఎంవీవీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/