నెలాఖరులోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలి
ఎన్నికల నిర్వహనపై సిఎం జగన్ సమీక్ష
అమరావతి: ఈ నెలాఖరులోగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఏపి సిఎం జగన్ ఆదేశించారు. ఏపిలో స్థానిక ఎన్నికలపై ఇవాళ సిఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపి హైకోర్టు తీర్పును ఆయన ప్రస్తావించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యంలను నియంత్రించాలనే ఆర్డినెన్సును తీసుకొచ్చామని, డబ్బు, మద్యం పంపినట్లు రుజువైతే ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు వేయాలని, మూడేళ్ల జైలు శిక్ష విధించాలని ఆదేశించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ యావత్తు దేశానికే ఆదర్శం కావాలని అధికారులకు సూచించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/