మంత్రి ఆదిమూలపు సురేశ్ నివాసానికి వెళ్లిన సిఎం జగన్
ఆదిమూలపు సురేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్
అమరావతిః ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కు ఇటీవల మాతృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఆదిమూలపు సురేశ్ తల్లి థెరీసమ్మ (85) అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు నిన్న జరిగాయి.
ఈ నేపథ్యంలో, సీఎం జగన్ నేడు ప్రకాశం జల్లా ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ నివాసానికి వెళ్లారు. థెరీసమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మృతితో విచారంలో ఉన్న ఆదిమూలపు సురేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/telangana/