మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం ఫైర్
Hyderabad: తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరుగుతోంది. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఈటల రాజేందర్, నిరంజన్రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. సమయానికి ఎందుకు రాలేకపోతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ 10.30 గంటలకే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సమావేశానికి హాజరయ్యేందుకు నిన్న రాత్రే హైదరాబాద్ చేరుకోవాలని మంత్రులను, ఎమ్మెల్యేలను కేసీఆర్ ఆదేశించారు. అయినా ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ అయ్యారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/