తెలుగు జర్నలిస్టుపై ఢిల్లీ సిఎం ప్రశంసలు

ప్లాస్మా దానం చేసిన తెలుగు జర్నలిస్టు

Delhi CM Arvind Kejriwal Praises Telugu Journalist Mahatma Kodiyar

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో మానవాళి యుద్ధం చేస్తుంది. ఐతే జర్నలిస్టులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూనే.. కరోనా టెస్ట్‌లు మొదలుకొని, కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల వరకు అప్‌డేట్స్‌ ఇస్తున్నారు. తాజాగా ఓ తెలుగు చానల్ లో ఢిల్లీ రిపోర్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న మహాత్మా కొడియార్ అనే జర్నలిస్టు ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్నారు. ధైర్యంగా కరోనాను ఎదుర్కొని సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకున్నారు. మహాత్మా తాజాగా ఢిల్లీలోని ప్లాస్మా బ్యాంక్ లో తన ప్లాస్మాను దానం చేశారు. అనేకమంది కరోనా పేషెంట్ల చికిత్సకు అవసరమైన ప్లాస్మాను అందించారు. దీనిపై ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘ప్రియమైన మహాత్మా కొడియార్, మీ అమూల్యమైన ప్లాస్మా దానం ఓ ప్రాణం కాపాడేందుకు సాయపడుతుంది’ అంటూ ట్వీట్ చేశారు. ‘మన మీడియా రిపోర్టర్లు ఎంతో ప్రమాదకర పరిస్థితుల్లోనూ ముందు నిలిచి పోరాడుతూ మనకు వార్తలు అందిస్తున్నారు’ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/