శ్వేతసౌధ్యంలో కరోనా..స్పందించిన పౌచీ
కరోనా అభూత కల్పన అని కొందరు నమ్ముతున్నారు

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు శ్వేతసౌధంలోని పలువురికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ మాస్క్ లేకుండా ఫొటలకు పోజులు ఇస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోని ఫౌచి స్పందించారు. కరోనా మహమ్మారి అభూత కల్పన అని నమ్మే మొండివారితో నివారణ చర్యల గురించి ఎలా చర్చించాలి? అని ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనిపై పౌచి స్పందిస్తూ వైట్హౌస్లో కరోనా కేసులను ముందే నివారించవచ్చని తెలిపారు. ఈ వారం వైట్హౌస్ను చూడండని, అక్కడ జరుగుతున్నది వాస్తవమని తెలిపారు. ప్రతి రోజూ మరింత మంది కొవిడ్ బారిన పడుతుంటారని, ఇది అభూత కల్పన కాదని చెప్పారు. ఇది దురదృష్టకర పరిస్థితని, అసలు ఇది చోటు చేసుకోకుండా ముందే నివారించవచ్చని వ్యాఖ్యానించారు. ట్రంప్కి కరోనా సోకినప్పటికీ ఆయన ప్రవర్రిస్తోన్న తీరు పట్ల విమర్శలు వస్తోన్న నేపథ్యంలో పౌచీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/