ఇసుక కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

తదుపరి విచారణను ఈ నెల 22 వరకు వాయిదా వేసిన హైకోర్టు

cid-told-ap-high-court-that-they-will-not-arrest-chandrababu-until-28th

అమరావతిః ఇసుక కేసులో టిడిపి అధినేత చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును ఈ నెల 28వ తేదీ వరకు అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. సీఐడీ తరపు న్యాయవాదుల స్టేట్మెంట్ ను రికార్డు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఆరోగ్య కారణాల వల్ల ఈ నెల 28వ తేదీ వరకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇసుక కేసులో చంద్రబాబును ఏ2గా సీఐడీ పేర్కొంది.