” చెన్నకేశవరెడ్డి” నిర్మాత కీలక నిర్ణయం..ఫ్యాన్స్ సంతోషం

చెన్నకేశవరెడ్డి నిర్మాత బెల్లంకొండ సురేష్ కీలక నిర్ణయం తీసుకొని , నందమూరి అభిమానుల్లో సంబరాలు నింపారు. ఇటీవల కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. టాప్ హీరోలు నటించిన గత చిత్రాలను అత్యాధునిక టెక్నాలజీ తో రీ రిలీజ్ చేసి అభిమానుల్లో సంతోషం నింపుతున్నారు. పోకిరి , ఖుషి , తమ్ముడు వంటి చిత్రాలు ఈ మధ్య రీ రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్లు రాబట్టగా..తాజాగా బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు.

వివి వినాయక్ డైరెక్షన్లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం లో టబు , శ్రీయ హీరోయిన్లు నటించిన ఈ మూవీ 2002 లో విడుదలై చక్కటి విజయాన్ని అందుకుంది. తాజాగా సెప్టెంబర్ 25వ తేదీన ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు. ఈ మూవీ రీ రిలీజ్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ రీ రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా 5.39 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ నేపద్యంలో ఈ మూవీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రీ రిలీజ్ లో వచ్చిన పూర్తి డబ్బుని బాలకృష్ణ క్యాన్సర్ ఆసుపత్రికి డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. బెల్లంకొండ సురేష్ తీసుకున్న ఈ నిర్ణయం పై నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.