ఉద్యోగులకి 100 కార్లు గిఫ్ట్ ఇచ్చిన ఓ ఐటీ సంస్థ
చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఓ ఐటీ సంస్థ తమ ఉద్యోగులకు 100 కార్లను గిఫ్ట్గా ఇచ్చింది. కంపెనీ ప్రగతిలో సహకరించిన ఉద్యోగులకు.. అసాధారణ మద్దతు ఇచ్చినవారికి కార్లను బహుమతిగా ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. నగరానికి చెందిన ఐడియాస్2ఐటీ అనే కంపెనీ వంద ఉద్యోగులకు మారుతీ సుజుకీ కార్లను గిఫ్ట్గా ఇచ్చింది.
పదేళ్ల నుంచి కంపెనీ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన వంద మంది ఉద్యోగులకు 100 కార్లను ఇస్తున్నట్లు Ideas2IT కంపెనీ మార్కెటింగ్ అధిపతి హరి సుబ్రమణియం తెలిపారు. తమ కంపెనీలో సుమారు 500 ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. తాము పొందిన సంపదను తిరిగి ఉద్యోగులకు ఇవ్వడం తమ ఉద్దేశమని తెలిపారు. కంపెనీ ఉద్యోగులకు కార్లు ఇవ్వడం లేదని, ఉద్యోగులే తమ సామర్థ్యాన్ని ధారిపోసి ఆ కార్లను స్వొంతం చేసుకున్నారని చైర్మెన్ మురళీ వివేకానందన్ తెలిపారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/