నేటి నుండి కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుండి మూడు రోజుల పాటు కోనసీమ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈరోజు మండపేట నియోజకవర్గంలో భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రస్తుతం తోండ్రేడు లో ఉన్న చంద్రబాబు … మధ్యాహ్నం మడికి, దూల్ల మీదుగా ఏడిదకు వెళ్ళనున్నారు. ఇక అక్కడ రైతులతో రచ్చబండ నిర్వహిస్తారు .

అనంతరం మండపేట కలప పువ్వు కూడలిలో నిర్వహించే రోడ్ షోలో కూడా పాల్గొంటారు. ఇక రేపు కొత్తపేట ఎల్లుండి అమలాపురం నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రబాబు కోనసీమ పర్యటన నేపథ్యంలో… ఆయా నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న వైజాగ్ లో చంద్రబాబు ఒక విజన్‌ డాక్యుమెంటును విడుదల చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు విశాఖ నగరంలోని ఎంజీఎం పార్కు గ్రౌండ్‌ లో ప్రజల సమక్షంలో ఆవిష్కరించి.. అందులోని ముఖ్యాంశాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు.