ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం ..పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలు

breaks-out-in-a-factory-in-delhi-narela-area

న్యూఢిల్లీః దేశరాజధాని ఢిల్లీ లో భారీ అగ్నిప్రమాదం సభవించింది. నరేలా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీ లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో సమీపంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.