నటుడు శుభ‌లేఖ సుధాకర్ ఇంట్లో విషాద ఛాయలు

నటుడు శుభ‌లేఖ సుధాకర్ ఇంట్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఆయ‌న మాతృమూర్తి, ప్ర‌ముఖ గాయ‌కురాలు ఎస్‌పీ శైల‌జ అత్త ఎస్ఎస్ కాంతం(80) చెన్నైలో మృతి చెందారు. మూడు నెలల క్రితం గుండెపోటుకు గురైన కాంతం.. ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు.

మహాలింగపురంలోని సుధాకర్‌ నివాసంలో తండ్రి సూరావజ్జల కృష్ణారావు, తల్లి ఎస్‌ఎస్‌ కాంతం ఉండేవారు. రెండేళ్ల క్రితం కృష్ణారావు మరణించారు. ఇప్పుడు ఆయ‌న త‌ల్లి కూడా చ‌నిపోవ‌డం ఆ కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు కాగా సుధాకర్‌ పెద్దవారు. రెండో కుమారుడు మురళీ దత్తుపోయి వైజాగ్‌లో, మూడో కుమారుడు సాగర్‌ అట్లాంటాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం సుధాకర్ సినిమాలతో పాటు సీరియల్స్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సుధాకర్ మాతృమూర్తి మరణ వార్త తెలుసుకొని సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియపరుస్తున్నారు. కాంతం అంత్య‌క్రియ‌లు ఈ రోజు మ‌ధ్యాహ్నాం జ‌ర‌గ‌నున్నాయి.