ఝలార్ పటాన్ నుంచి వసుంధరా రాజే నామినేషన్ దాఖలు
జైపూర్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయా రాష్ట్రాల్లో హడావిడి ఊపందుకున్నది. అభ్యర్థుల నామినేషన్లు, ప్రచారాలు జోరందుకున్నాయి. తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్య మంత్రి, బిజెపి అభ్యర్థి వసుంధరా రాజే నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్లోని ఝలార్ పటాన్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్న ఆమె శనివారం ఉదయం తన అనుచరులతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మొత్తం 200 స్థానాలున్న రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 25న జరగనుంది. డిసెంబర్ 3న మిగతా నాలుగు రాష్ట్రాలతోపాటు రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.