రాజధాని తరలింపును ఆపే శక్తి బీజేపీకే ఉంది
Amaravati: రాజధాని అమరావతి నుంచి తరలింపును ఆపే శక్తి బీజేపీకే ఉందని ఏపీ మాజీ మంత్రి, బీజేనీ నేత కామినేని శ్రీనివాస్ అన్నారు. అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులను ఈరోజు కలిసి ఆయన సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాజధాని అంశంపై నెలకొన్న ప్రతిష్ఠంభన విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు సమయం వచ్చినప్పుడు సరిగానే స్పందిస్తారని కామినేని అన్నారు. రైతుల సమస్యను కేంద్రంలోని పెద్ద దృష్టికి తీసుకువెళ్తానన్నారు. రాజధాని తరలిస్తే ఇప్పటికే నిర్మించిన భవనాలు ఏం చేస్తారని ప్రశ్నించారు. రాజధాని తరలిపోకుండా బీజేపీ ఆపగలదన్నారు. రాజధాని విషయంలో బీజేపీ, జనసేన సంయుక్త కార్యాచరణ ఇప్పటికే ప్రకటించాయన్నారు.
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com/