గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేల్‌ ప్రమాణ స్వీకారం

గాంధీనగర్: బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ నేడు గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార చేశారు. గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, నరేంద్ర సింగ్ తోమర్, మన్షుఖ్ మాండవీయ, ప్రహ్లాద్ జోషి, పర్సోత్తమ్ రూపాల, ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రమోద్ సావంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గత శనివారంనాడు విజయ్ రూపానీ, ఆయన మంత్రివర్గం రాజీనామా చేయడంతో కేంద్ర పరిశీలకుల సమక్షంలో ఆదివారం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్‌కు ప్రధాని మోడీ శుక్షాకాంక్షలు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/