భారీ ధరకు భోళా శంకర్ ఆంధ్ర రైట్స్..

chiranjeevi's 'Bholaa Shankar'
chiranjeevi’s ‘Bholaa Shankar’

మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కలయికలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ ఫై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ సాంగ్ శ్రోతలను బాగా అలరించింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ తాలూకా ఆంధ్ర రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

‘భోళా శంకర్’ మూవీ ఆంధ్ర లోని అన్ని ఏరియాల రైట్స్ కలిపి 45 కోట్ల రూపాయల కు అమ్ముడుపోయినట్లు వినికిడి. అందులో నూ ఒక్క వైజాగ్ రైట్స్ మాత్రమే ఏకంగా 10 కోట్లు పలికినట్లు సమాచారం. ఇంత ధర పలకడం ఈ మధ్య కాలంలో ఇదే అని అంటున్నారు సినీ వర్గాలు. ఈ మూవీ లో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. సుశాంత్ కీలక మైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. దీనికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.