వర్షా కాలంలో తినాల్సిన పండ్లు

ఆహారం – ఆరోగ్యం

వర్షా కాలంలో వచ్చే వ్యాధులను ఎదుర్కోవటానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచే కొన్ని పండ్లు తినాలి.. చాలా మందికి వర్షాకాలం వచ్చిందంటే గరం గరం సమోసా, మిర్చి బజ్జీలను లాగించాలని అన్పిస్తుంది.. అయితే వర్షా కాల సీజన్లో లో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు కొన్ని ప్రత్యేక పండ్లు తినాలి .. వర్షాకాలం లో వచ్చే వ్యాధులను దూరంగా ఉంచేందుకు మనకు అందుబాటులో ఉండే పండ్లు దోహదపడతాయి.

best Fruits to eat in monsoon

నేరేడు:

వర్షాకాలం లో ఎక్కువగా దొరికేవి నేరేడు పండ్లు.. పండ్లలో రాజు అని కూడా అంటారు.. ఇందులో కెలోరీలు తక్కువగా ఉంటాయి.. ఇనుము, ఫోలేట్, పొటాషియం, విటమిన్లు అధికంగా ఉంటాయి . బరువు తగ్గాలనుకునే వారు నేరేడును తీసుకోవాలి.. అజీర్తి సమస్యను ఇవి తగ్గిస్తాయి.

దానిమ్మ:

రోగ నిరోధక శక్తి పెంచటంలో దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోజూ ఓ పండు తింటే ఆరోగ్యంగా ఉంటారు

ఆపిల్:

వర్షాకాలంలో జీవ క్రియల రేటు కాస్త నిదానంగా ఉంటుంది. దీంతో శరీరం కూడా చురుగ్గా ఉండదు . కావున ఆపిల్ ముక్కలు తింటే ఆరోగ్యంగా చురుగ్గా కూడా ఉంటాం.

ఆరటి :

అరటిలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసే శక్తి అరటికి ఉంది . అజీర్తి సమస్య ఉండదు. పిల్లలకు రోజూ ఓ అరటి పండు తినిపించాలి. దీంతో శరీరానికి శక్తి అందటామె కాదు, పొట్ట నిండిన భావన కూడా కలుగుతుంది.

బొప్పాయి:

విటమిన్ ‘సి’ అధికంగా లభించే బొప్పాయి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.. వానా కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. ఇందులో పీచు ఏకువ.. అయితే బొప్పాయిని మితంగా తీసుకుంటేనే మంచిది.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/category/news/national/