బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దు..

bandi-sanjay-vijayawada-tour-cancelled

హైదరాబాద్ : బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దు అయింది. హైదరాబాద్-గన్నవరం ఫ్లైట్ 4 గంటలు ఆలస్యం కావడంతో పర్యటన రద్దు అయింది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు బండి సంజయ్ వర్చువల్ ద్వారా ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించునున్నారు.

ఇవాస్తవానికి ఇవాళ ఉదయం 9.30 గంటలకు గన్నవరం నుంచి ఇంద్రకీలాద్రి చేరుకోవాలని షెడ్యూల్‌ సెట్‌ చేసుకున్నారు బండి సంజయ్‌. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం అనంతరం నేరుగా బిజెపి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోవాలని అనునకున్నారు. అలాగే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని సమీక్షించాలని అనుకున్నారు. కానీ బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దు అయింది.