చలపతిరావు సంస్మరణ సభ కు హాజరై నివాళులు అర్పించిన బాలకృష్ణ

సినీ నటుడు చలపతి రావు డిసెంబరు 24న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తోన్న చలపతిరావు‌ను సినిమా వాళ్లంతా ముద్దుగా బాబాయ్ అని పిలుచుకునేవారు. మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు.

డిసెంబర్ 24 ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుతో హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో క‌న్నుమూశారు. 1200కి పైగా చిత్రాల్లో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో ఆయ‌న న‌టించారు. 1944 మే 8న కృష్ణా జిల్లా బ‌ల్లి ప‌ర్రులో చ‌ల‌ప‌తిరావు జ‌న్మించారు. ఈయ‌న‌కు ఇద్ద‌రు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

నేడు హైదరాబాద్ లో ఆయన సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. తనకెంతో సన్నిహితుడైన చలపతిరావు భౌతికకాయాన్ని చూసేందుకు రాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేసిన బాలకృష్ణ… ఈరోజు సంస్మరణ సభకు హాజరై..ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చలపతిరావు కుమారుడు రవిబాబును పరామర్శించారు.