అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మళ్లీ వాయిదా

ఈ రోజు జాబితాలో లేదన్న జడ్జి, రేపు విచారిస్తామన్న న్యాయవాది

avinash-reddy-anticipatory-bail-petition-on-thursday

హైదరాబాద్ః వివేకా హత్య కేసులో కడప ఎంపీ, వైఎస్‌ఆర్‌సిపి నేత వైయస్ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన విచారణ గురువారం జరగనుంది. మంగళవారం ఉదయమే విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ సుప్రీం కోర్టు ఆర్డర్ కాపీ రాకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం నిన్న మధ్యాహ్నం నేటికి వాయిదా వేశారు. బుధవారం విచారణ చేపడతామని పిటిషనర్ తరఫు న్యాయవాదులకు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు తెలిపింది. అయితే నేడు జాబితాలో అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ లేదు.

ఈ రోజు కోర్టు ప్రారంభం కాగానే అవినాశ్ రెడ్డి పిటిషన్ పైన విచారణ జరపాలని ఆయన తరఫు లాయర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇవాళ లిస్ట్ లో లేని కేసులపై విచారణ చేపట్టలేమని న్యాయమూర్తి చెప్పారు. గురువారం విచారణ చేపట్టాలని న్యాయమూర్తి కోరగా… అందుకు కోర్టు సమ్మతించింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ చేపడతామని తెలిపింది.