అఖిల ప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై దాడి
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/05/Akhilpriyabodaygurd.jpg)
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయినా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రికత్త ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలపై , కార్యకర్తలపై దాడి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై దాడి చేసి తీవ్రంగా గాయ పరిచారు. మంగళవారం రాత్రి అఖిల ప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా.. దుండగులు వాహనంతో అతి వేగంగా వచ్చి ఢీకొట్టడమే కాకుండా..తల పై రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టారు.
నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతకాలం క్రితం లోకేశ్ యువగళం పాదయాత్ర లో ఏవీ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిలో నిఖిల్ కీలక పాత్ర పోషించాడు. ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులే నిఖిల్ ని హతమార్చేందుకు ఈ దాడి చేశారని భూమా వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.