సా.6 వరకే బస్సు సర్వీసులు
ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం
Amaravati: రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు సడలింపు నేపథ్యంలో సోమవారం నుంచి బస్సు సర్వీసులను పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బస్సు సర్వీసులు ఉంటాయని పేర్కొంది. రాష్ట్రంలో వివిధ జిల్లాల మధ్య పగలు నడిచే దూరప్రాంత సర్వీసులను పెంచాలని నిర్ణయించింది. అదేవిధంగా దూరప్రాంత సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ను పునరుద్ధరణ కు ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం నుంచి బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించనున్నారు. అయితే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బస్సు సర్వీసులను నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/