నీలం సాహ్నీ నియామకంపై విచారణ వాయిదా

మరికొంత సమయం కోరిన పిటిషనర్

హైదరాబాద్: ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా నీలం సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు నేడు విచారించింది. విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎస్ఈసీ నియామక జాబితాలో ప్రభుత్వం పంపిన 3 పేర్లు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫున న్యాయవాది ఆరోపించారు. మరిన్ని అదనపు వివరాలు దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. అయితే, ఈ దశలో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి సమాచారం లేకుండా పిల్ ఎలా వేస్తారని ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/