మరోసారి రూ.1,000 కోట్లు రుణం తీసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

7.45 శాతం వడ్డీకి తాజా రుణాన్ని సేక‌రించిన రాష్ట్ర ప్ర‌భుత్వం

ap state logo
ap state logo

అమరావతిః ఏపీ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం మ‌రో రూ.1,000 కోట్ల రుణం తీసుకుంది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్వ‌హించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏపీ ప్ర‌భుత్వం ఈ రుణాన్ని సేక‌రించింది. ఈ రుణంలో రూ.55 కోట్ల‌ను 18 ఏళ్ల కాల వ్య‌వ‌ధికి 7.45 శాతం వ‌డ్డీకి తీసుకున్న ఏపీ ప్ర‌భుత్వం… మ‌రో రూ.500 కోట్ల‌ను 20 ఏళ్ల కాల వ్య‌వ‌ధికి 7.45 శాతం వ‌డ్డీకి సేక‌రించింది. ఈ కొత్త రుణంతో ఏపీ ఈ ఏడాదిలో ఇప్ప‌టిదాకా రూ.48,608 కోట్ల రుణాల‌ను తీసుకున్న‌ట్టైంది. ఈ ఏడాదిలో కేంద్రం విధించిన ఎఫ్ఆర్‌బీఎం రూ.48 కోట్లు కాగా… తాజా రుణంతో ఏపీ ప్ర‌భుత్వం ఆ ప‌రిమితిని దాటేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/